LATEST UPDATES

28, జూన్ 2018, గురువారం

ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్న పీఆర్సీ

This is a simple translate button.

*📢ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్న పీఆర్సీ

*వివిధ క్యాటగిరీలు, వేతన స్కేళ్లపై అధ్యయనం

*ఉద్యోగులకు, శాఖాధిపతులకు ప్రశ్నావళి

*అగస్టు 15లోగా ప్రభుత్వానికి నివేదిక

రాష్ట్రప్రభుత్వం సీఆర్ బిశ్వాల్ సారథ్యంలో ఏర్పాటుచేసిన పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) ఉద్యోగులకు సంబంధించిన పూర్తివివరాలను సేకరిస్తున్నది. వివిధ క్యాటగిరీల ఉద్యోగులకు అమలవుతున్న వేతనవిధానం, డీఏ, అలవెన్సులు తదితరఅంశాలను పరిశీలిస్తున్నది. ఆగస్టు15లోగా నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని కమిటీ సమాయత్తమవుతున్నది. ఒకే క్యాడర్ ఉద్యోగులకు ఒక్కోశాఖలో ఒక్కో వేతన విధానం అమలవుతున్న విషయాన్ని కమిషన్ పరిశీలించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పీఆర్సీ కమిషన్ వివిధ శాఖలకు, ఉద్యోగులకు, శాఖాధిపతులకు ప్రశ్నావళిని పంపించింది. 1993, 1999, 2005, 2010, 2014 సంవత్సరాల్లో పీఆర్సీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేస్తున్నది. 2014లో కనిష్ఠ వేతనం రూ.13000లు, గరిష్ఠవేతనం రూ.1,10,850 లుగా నిర్ణయించారు. ప్రస్తుతం అమలుచేస్తున్న మాస్టర్‌స్కేల్ విధానంపై అన్నిశాఖల ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి