LATEST UPDATES

3, జులై 2021, శనివారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
నా వయస్సు 55సం.లు. నేను స్కూల్ అసిస్టెంట్ గా 12సం.లు సర్వీసు పూర్తి చేసితిని. 12సం.లు స్కేలు రావడానికి నేను EOT, GOT పరీక్షలు పాస్ అయ్యాను. నాకు12సం.లు ఇంక్రిమెంట్ ఏ తేదీ నుంచి ఇస్తారు?

జవాబు:
ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ లో 12 సం.లు పొందడానికి స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో EOT,GOT పరీక్షలు వ్రాసి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆఖరి పరీక్ష తేదీ నుండి వర్తింపచేయాలి.


2. ప్రశ్న:
నాకు 50 ఇయర్స్ దాటినవి. నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను. నాకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా?

జవాబు:
G.O.Ms.No.93, Dt.03.04.2010 లో రెగ్యులర్ ప్రమోషన్ కి ఇచ్చిన రాయితీలు అన్నీ AASకు కూడా వర్తించునని పేర్కొనబడినది. అయితే ఆర్థికశాఖ వారి మెమో నెం.034408/248/PC-2/2011, Dt.02.04.2012 ద్వారా ఈ నిబంధనను నిరాకరిస్తూ వివరణ ఇచ్చినది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా 12సం.లు ప్రమోషన్ స్కేలు పొందడానికి EOT,GOT లలో ఉత్తీర్ణత కావలసియున్నది.


3. ప్రశ్న:
SGTలలో 50 సం.లు దాటినవారు EOT, GOT పాస్ కాకుండా 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?

జవాబు:
కారు. వారు కూడా G.O.Ms.No.93, Dt.03.04.2010 ప్రకారం  అందుకు సంబంధించిన విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి.


4.  ప్రశ్న:
నేను 30-11-2020 న రిటైర్మెంట్ అయ్యాను. మరి నా యొక్క పి.ఆర్.సీ ఏవిధంగా చేయించుకోవాలి.? AG ఆఫీస్ కు పంపాలా? ఇక్కడే ట్రెజరీ లో ఇవ్వాలా? తెలుపగలరు.

జవాబు:
1-7-2018 కన్న ముందు రిటైరయిన వారి fixation డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ పంపే ప్యాకేజీ తో DTO లే చేస్తారు.
 1-7-2018 తరువాత 28-2-2021 వరకు రిటైరైన వారు గతంలో ఎక్కడి నుండి రిటైర్ అయినారో అక్కడి డ్రాయింగ్ & disbursing అధికారి ( DDO ) నుండి pay fixation చేయించుకొని సర్వీసు పుస్తకంలో నమోదు చేయించుకొని, గతంలో ఏ విధంగా పెన్షన్ కోసం ఫారాలు నింపామో ఆవిధంగానే revised పెన్షను ఫారాలు నింపి DDO తో sanction చేయించి వారితోనే direct గా AG ఆఫీసుకు పంపాలి.

30, జూన్ 2021, బుధవారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:
కారుణ్య నియామకాలను ఏవిధంగా, ఏయే పోస్ట్ లో నింపుతారు? వేరే జిల్లాలో కూడా పోస్టింగ్ ఇస్తారా? కావాలంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఇస్తారా? తెలుపగలరు.

జవాబు:
కారుణ్య నియామకాలు జూనియర్ సహాయకులు లేదా అంత కన్నా తక్కువ పోస్టులందు నియమిస్తారు. ఈ పోస్టులన్ని కూడా జిల్లా స్థాయి పోస్టులు. కావున అభ్యర్థుల స్థానికత కూడా జిల్లా స్థాయిలోనే చూస్తారు. ఆంధ్ర ప్రదేశ్/ తెలంగాణ కు లోకల్ అని కాదు. అభ్యర్థి ఏ జిల్లాకు లోకల్ ఐతే ఆ జిల్లాలో మాత్రమే నియమిస్తారు. సాధారణంగా నియమించే పోస్ట్ జిల్లా స్థాయి/జోనల్ స్థాయి/రాష్ట్ర స్థాయి అయినప్పుడు అభ్యర్థులు కూడా ఆ ప్రాంతానికి లోకల్ అయి ఉండాలి.


ప్రశ్న:
ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ లో ఎలాంటి డిపార్టుమెంట్ టెస్ట్ ల గురించి ఇవ్వలేదు. కానీ సర్వీస్ రూల్స్ లో కచ్చితంగా డిపార్టుమెంట్ టెస్ట్ లు పాస్ కావాలన్నారు. మరి అలాంటప్పుడు నోటిఫికేషన్ కి విలువ లేదా.? మరలా ఇప్పుడు డిపార్టుమెంట్ టెస్ట్ పరీక్ష పెట్టి పాస్ కావాలి అంటున్నారు. మరలా రేపు ఇంకో పరీక్ష పాస్ కావలంటారు. ఇలా ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్ కి విరుద్ధంగా చేయవచ్చా?. తెలుపగలరు.


జవాబు:
నోటిఫికేషన్ లో సర్వీస్ రూల్స్ మొత్తం చెప్పరు. మీ సర్వీస్ రూల్స్ లో ఉన్నవి పాస్ కావాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా చేరిన కొంతమంది ఉద్యోగులకు ట్రైనింగ్స్ ఉంటాయి. ట్రైనింగ్స్ లో టెస్టులు పెడతారు. వాటిని పాస్ కావల్సి ఉంటుంది
ఇవి దశాబ్దాల కాలం నుండి ఉద్యోగులకు ఉన్న నిబంధనలే.
గ్రూప్1, గ్రూప్2 వాళ్లకు ఇలాగే కండిషన్లు ఉంటాయి. వారికి ఏమైనా నోటిఫికేషన్ లో ఇస్తున్నారా లేదు కదా
ఇవి మద్రాస్ స్టేట్ లో ఉన్నప్పుడు, మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఉన్న నిబంధనలే.


ప్రశ్న:
ప్రస్తుతకాలంలో ప్రభుత్వాలు జాబ్ ఛార్ట్ లు, పవర్స్ ఇవ్వడం, కొంతమేరకు పవర్స్ తీసివేయడం జరుగుతుంది కదా! ఇది ఎంతవరకు సబబు? దీని వలన ఉద్యోగలు ఆందోళనకు గురయ్యే పరిస్థితులు కదా! ఇది మంచిదేనా?

జవాబు:
కార్యాలయంలో లేదా DSC లేదా TSPSC లో జాయిన్ అయ్యిన..ప్రతిఒక్కరూ వారి వారి జాబ్ చార్ట్ చూసే జాయిన్ అయ్యి ఉంటారు. నోటిఫికేషన్ లో ఇచ్చిన రూల్స్ మీరు నేను అంగీకరించే జాబ్ లో జాయిన్ అయ్యి ఉన్నాం. జాబ్ చార్ట్ మారవడం... పవర్స్ ఇవ్వడం... పవర్స్ తీసివేయడం అనేది పరిపాలనా సౌలభ్యం కొరకు గవర్నమెంట్ ఇష్టం. కేవలం ప్రస్తుతం వచ్చే జీతం కన్నా తక్కువ ఇవ్వకుండా మార్పులు ఎన్ని అయ్యినా చేయొచ్చు గవర్నమెంట్.
Example: VRO system In Telegena. System తీసేశారు... అంతే కానీ ఉద్యోగిని తేసేయలేదు కదా...
అలాగే ఉద్యోగికి కండక్ట్ రూల్స్ గురించి పూర్తి అవగహన ఉంటే అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మనలో చాలా మంది ఉద్యోగులకు కండక్ట్ రూల్స్ గురించి పూర్తి అవగాహన లేదు అనేది వాస్తవం.
చివరగా గవర్నమెంట్ ఇచ్చిన duty చేయడమే మన పని.

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు


1. ప్రశ్న:
పెన్షనర్ మరణించినపుడు కుటుంబ సభ్యులు ఏమి చెయ్యాలి?

జవాబు:
పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీ లో తెలియపరచాలి. తెలియపరచకుంటే మరల లైఫ్ సెర్టిఫికెట్ (ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్/ ఐరిష్) ఇచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఏటిఎం తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ భాద్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు. రెండవది ప్రభుత్వంనకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి. చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కకట్టి అకౌంట్ లో వేస్తారు.


2. ప్రశ్న:
PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా?

జవాబు:
వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప, సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.


3. ప్రశ్న:
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు?

జవాబు:
ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసులో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు. 2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లకి అవకాశం కల్పించారు.


4. ప్రశ్న:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు?

జవాబు:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.


5. ప్రశ్న:
ఒక ఉద్యోగి చనిపోయిన తర్వాత అతని భార్యకు పెన్షన్, గ్రాట్యుటీ ఇస్తారు కదా! మరి ఆ ఉద్యోగికి దివ్యాంగురాలైన కుమార్తె ఉంటే ఏవిధమైన తేడాతో గ్రాట్యుటీ, పెన్షన్ ను ఇస్తారు? వివరించగలరు.

జవాబు:
తేడా ఏమీ ఉండదు. అర్హత కలిగిన గ్రాట్యుటీ ని నామినీలకు ఇస్తారు. ఒకవేళ నామినేషన్ ఇచ్చి ఉండక పోతే భార్యకు, పిల్లలకు సమాన షేర్ లు ఇస్తారు.

28, జూన్ 2021, సోమవారం

మరణించిన ఉద్యోగికి ఇద్దరు భార్యలు వుంటే (Legally Married) ఫ్యామిలీ పెన్షన్‌ ఎలా చెల్లిస్తారు?

మరణించిన ఉద్యోగికి ఇద్దరు భార్యలు వుంటే (Legally Married) ఫ్యామిలీ పెన్షన్‌ ఎలా చెల్లిస్తారు?

జ॥ 1) ఫ్యామిలీ పెన్షన్‌ సమాన వాటాలుగా ఇద్దరికీ చెల్లించాలి.

2) ఒకవేళ ఒక భార్య చనిపోయినా/ తిరిగి పెళ్ళి చేసుకొన్నా ఆమె వాటా ఆమె ద్వారా జన్మించిన పిల్లలకు చెల్లించాలి.

3) పిల్లలు లేకపోతే ఆమె వాటా రద్దు చేస్తారు.

4) చనిపోయిన ఉద్యోగికి ఇద్దరు భార్యలు వుండి, అందులో ఒకరు ముందుగానే మరణిస్తే, ఆమె ద్వారా కలిగిన పిల్లలకు ఆమె బ్రతికి వుంటే ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్‌ వాటా చెల్లించాలి.

రూలు 50 (6) (2) (i)(ii)(బి)

చనిపోయిన ఉద్యోగి / పెన్ననరుకు కుమారులు, కుమార్తెలు వుంటే ఫ్యామిలీ పెన్షను ఎలా చెల్లిస్తారు?

జ॥ 1) మొట్ట మొదటగా కుమారులకు వరుసగా వారికి 25 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు చెల్లించాలి.

2) ఆ తరువాత కుమార్తెలకు వరుసగా వారికి పెళ్ళి అయ్యేంత వరకు చెల్లించాలి.

3) పెద్దవాడు 25 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత చిన్న వానికి చెల్లించాలి.

4) పిల్లలు మైనరు అయితే గార్జియన్‌ ద్వారా చెల్లించాలి.

రూలు 50 (7) (ii) 8,9.