LATEST UPDATES

15, మే 2021, శనివారం

సందేహం:- పాత పెన్షన్ ఉద్యోగిపదవీ విరమణ/ అకాల మరణం చెందిన సందర్బంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ?

సందేహం:- పాత పెన్షన్ ఉద్యోగిపదవీ విరమణ/ అకాల మరణం చెందిన సందర్బంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ?

👉సమాధానం:- కొత్త పెన్షన్ వారికి అవకాశం లేకుండా పాత పెన్షన్ లో ఆర్థిక లబ్ది ఉన్నవాటిని, వాటిని ఎలా గణిస్తారో మీ ముందుంచుచున్నాను. చేసిన సర్వీస్ ని యూనిట్ల ప్రకారం లెక్కిస్తారు. ఆరు నెలలకు ఒక యునిట్ చొప్పున లెక్కించాలి. చివరగా మిగిలిన నెలలు రోజులకు గాను 3నెలలు దాటితే ఒక యునిట్ గా లెక్కించాలి.

అకాల మరణం పొందిన సందర్భంలో:
👉డెత్ గ్రాట్యూటి : ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే క్రింది విధంగా గ్రాట్యుటీ చెల్లించబడును.
👉ఎ) సర్వీస్ ఒక సంవత్సరం పూర్తికాకుండానే ఉద్యోగి మరణిస్తే 3 సంవత్సరాల అర్హత గల సర్వీస్ కు అర్హతగల గ్రాట్యుటీ ఇవ్వబడును.
👉బి) సర్వీస్ 1 సంవత్సర కాలం పూర్తి చేసి 5 సంవత్సర కాలం పూర్తిగా కాకుండా మరణిస్తే 9 ఏండ్ల సర్వీసుకు లెక్కకట్టి చెల్లిస్తారు.
👉సి) సర్వీస్ 5 సంవత్సర కాలం పూర్తి చేసి 18 సంవత్సర కాలం పూర్తిగా కాకుండా మరణిస్తే 18 ఏండ్ల సర్వీసుకు లెక్కకట్టి చెల్లిస్తారు.
👉డి) సర్వీస్ 18 సంవత్సర కాలం పూర్తి చేసి మరణిస్తే చేసిన సర్వీసుకు లెక్కకట్టి చెల్లిస్తారు.
👉Formula : (Last drawn (Pay+DA) X Qualifying Service Half Units) 4
👉(RPS 2015 ప్రకారం గరిష్ట పరిమితి 12 లక్షలు)
ఫ్యామిలీ పెన్షన్: ఉద్యోగం చేస్తూ కాని రిటైర్ అయిన తరువాత గాని ఉద్యోగి మరణించినచో వారి భార్య / భర్త లేదా అర్హత గల కుటుంబ సభ్యులకు ఇచ్చు పెన్షన్ ను కుటుంబ పెన్షన్ అంటారు.
👉i. సర్వీస్ 7 సంవత్సరాలు పూర్తి కాకుండా చనిపోయినచో అతని కుటుంబ సభ్యులలో అర్హులకు ఉద్యోగి చివరగా పొందిన మూలవేతనంలో 30% ఫామిలీ పెన్షన్ చెల్లిస్తారు. ఆరోజు ఉన్న కరువు భృతిని కలిపి చెల్లిస్తారు.
👉ii. సర్వీస్ 7 సం॥లు పూర్తి చేసి పదవీ విరమణ కాకుండా ఉద్యోగి మరణించినచో కుటుంబ సభ్యులలో అర్హులకు మొదటి 7సం॥ లు ఉద్యోగి చివరగా పొందిన మూలవేతనంలో 50% (మరణించిన ఉద్యోగి వయసు 65 సంవత్సారాలు మించకుండా), 7 సంవత్సరాల తరువాత జీవించి ఉన్నంత వరకు చివరినెల జీతంలో 30% చొప్పున ఇవ్వబడును. ఆరోజు ఉన్న కరువు భృతిని కలిపి చెల్లిస్తారు.

👉1. సాధారణ పదవీ విరమణ/ స్వచ్చంద పదవీ విరమణ సందర్భంలో:
👉 రిటైర్ మెంట్ గ్రాట్యిటీ: 5 సం॥ ల సర్వీస్ వేయిటెజ్ తో కల్పి ప్రతి 6 నెలల సర్వీస్ కి ఒక యూనిట్ చొప్పున మొత్తం యూనిట్స్ ని లెక్కించగా వచ్చిన యూనిట్లను గరిష్ఠం గా 66 యునిట్లతో చివరగా డ్రా చేసిన బేసిక్ పే మరియు డి.ఎ ను గణించి 4 తో భాగించగా వచ్చిన రూపాయలను RPS 2015 ప్రకారం గరిష్ఠం గా 12లక్షల వరకు చెల్లిస్తారు.
Gratuity Formul : Last drawn(Pay+DA) X Half Yearly Service Units * 4

సర్వీస్ పెన్షన్: 5 సం॥ ల సర్వీస్ వెయిటేజ్ తో కల్పి ప్రతి 6 నెలల సర్వీస్ కి ఒక యూనిట్ చొప్పున మొత్తం యూనిట్స్ ని లెక్కించగా వచ్చిన యూనిట్లను గరిష్ఠం గా 66 యునిట్లను తీసుకోవాలి. ఆరోజు ఉన్న కరువు భృతిని కలిపి చెల్లిస్తారు.

Service Pension Formula: Last Pay drawn X Half Yearly Service Units 2 X 66

ఫ్యామిలీ పెన్షన్: రిటైర్ అయిన తరువాత ఉద్యోగి మరణించినచో వారి భార్య / భర్త లేదా అర్హత గల కుటుంబ సభ్యులకు ఇచ్చు పెన్షన్ ను కుటుంబ పెన్షన్ అంటారు. పెన్షనర్ గా ఉండి మరణిస్తే పదవీ విరమణ తేది నుండి 7సం॥ ల కాలము లేదా మరణించిన సర్వీస్ పెన్షనర్ కు 65సం॥ వయసు పూర్తయ్యే తేది వరకు ఏది ముందయితే అంతవరకు చివరినెల జీతంలో 50% తరువాత జీవించి ఉన్నంత వరకు చివరినెల జీతంలో 30% చొప్పున ఇవ్వబడును. ఆరోజు ఉన్న కరువు భృతిని కలిపి చెల్లిస్తారు.

Commutation of Pension: ఉద్యోగికి మంజూరయిన పెన్షన్ లో కొంతభాగాన్ని గరిష్ఠంగా 40% అమ్ముకొని దానికి బదులుగా ఒకేసారి మొత్తాన్ని పొందే సౌకర్యం ఉంది. కమ్యుటేషన్ పొందిన తేది నుండి 15సం॥ ల పాటు కమ్యుటేషన్ చేసిన భాగం పెన్షన్ తగ్గింపు చేసి చెల్లిస్తారు కాని కరువు భృతిని మొత్తంపై కలిపి చెల్లిస్తారు. ఇది ఉద్యోగి ఐచ్చికం మాత్రమే తప్పని సరికాదు. ఇది బ్యాంకుక్షా నుండి దాదాపు 8.5% వడ్డీకి అప్పు తీసుకుని చెల్లించినట్టుగా ఉంటుంది. ఇలాంటి అవకాశం కూడా కొత్త పెన్షన్ వారికి అవకాశం లేదు.

సందేహం:- CPS ఉద్యోగి పదవీ విరమణ పొందేరోజు ఎంత చెల్లిస్తారు? పెన్షన్ ఎలా చెల్లిస్తారు? ఏఎ రకమైన పెన్షన్ చెల్లిస్తారు?

👉సమాధానం:-GOMS. No.. 62 తేది 07.03.2014 ప్రకారం ఖాతాదారుడు స్వచ్చంద పదవీ విరమణ, పదవీ విరమణ, అకాల మరణం మూడు సందర్భాలలో ఖాతా నుండి డబ్బును తిరిగి పొందగలరు.

1) స్వచ్చంద పదవీ విరమణ సందర్భంలో: ఉద్యోగి స్వచ్చంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతా లో ఉన్న మొత్తంలో నుండి 80% ను నెలవారీ పెన్షన్ గా ఇవ్వడానికి Annuity Service Providers లో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందచేస్తారు. 20% నిధిని చెల్లిస్తారు. మొత్తం నిధి 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

2) సాధారణ పదవీ విరమణ సందర్భంలో: ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతా లో ఉన్న మొత్తంలో నుండి 40% ను నెలవారీ పెన్షన్ గా ఇవ్వడానికి Annuity Service Providers లో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అంద చేస్తారు. 60% నిధిని చెల్లిస్తారు. మొత్తం నిధి 2 లక్షల లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
3) అకాల మరణం పొందిన సందర్భంలో: ఉద్యోగి ఖాతా లో ఉన్న మొత్తం (100%) ను నామినికి(లకు) చెల్లిస్తారు.
నిర్ణీత శాతాలలో చేతికి ఇచ్చే సొమ్ముకు ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు లేకపోవడం ఇబ్బందికరం.

PFRDA సర్కులర్ PFRDA/2015/27EXIT/2 తేది 12. 11.2015 ప్రకారం తేది 01.04.2016 నుండి CPS అమౌంట్ ని విత్ డ్రా చేయడం కోసం అప్లై చేయడం కేవలం (except death cases) ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ప్రస్తుతానికి నెలవారిగా పెన్షన్ చెల్లించడానికి 5 Annuity Service Providers గా నియామాకం చేశారు అవి.
1) Life Insurance Corporation of India 2).HDFC Life Insurance Co. Ltd
3). ICICI Prudential Life Insurance Co. Ltd 4).SBI Life Insurance Co Ltd
5).Star Union Dai-ichi Life Ins. Co. Ltd
డిఫాల్ట్ Annuity ప్రొవైడర్ గా SBI ని తీసుంటున్నారు.

పెన్షన్ చెల్లించడానికి నియామకం చేసిన ఐదు అన్యుటి సర్వీస్ ప్రొవైడర్స్ లో ప్రభుత్వ రంగ సంస్థలయిన SBI మరియు LIC లను పరిశీలనకు తీసుకునగా SBI వారు 15 రకాల పెన్షన్ లను LIC వారు 10 రకాల పెన్షన్ లను వివిధ వయసుల వారిగా అందిస్తున్నారు, మనం పెట్టే పెట్టుబడికి 1లక్ష రూపాయలకు నెలవారిగా ఆయా వయసువారికి పెన్షన్ గా చెల్లించే మొత్తము తేది 03.03.2016 నాటి విలువలను బట్టి ఉన్నాయి.

సందేహం:- CPS ఉద్యోగి పదవీ విరమణ/ అకాల మరణం చెందిన సందర్బంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ?
👉సమాధానం:- పైన చెప్పిన టేబుల్ లో ఎంచుకున్న పెన్షన్ చెల్లిస్తారు, సాధారణ పదవీ విరమణ అయిన సందర్భంలో 60% CPS నిధిని, స్వచ్చంద పదవీ విరమణ అయిన సందర్బంలో 20% CPS నిధిని చెల్లిస్తారు. గ్రాట్యూటి ని ప్రస్తుతం చేల్లించడం లేదు, గ్రాట్యూటి అనేది ఉద్యోగులకు వాళ్ళు చేసిన సేవలకు భాహుమానంగా ఇచ్చేది దీనిని ప్రైవేట్ సెక్టార్ లో కూడా చెల్లిస్తున్నారు కాని CPS ఉద్యోగులకు గ్రాట్యూటి సదుపాయం లేకపోవడం గర్హనీయం. దీనికోసం ఎప్పటినుండో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడం జరుగుతుంది. ఉద్యోగి అకాల మరణం చెందిన సందర్భంలో వారి ఖాతాలో జమ అయిన మొత్తం నిధిని చెల్లిస్తారు.
👉కాని కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన ఫామిలీ పెన్షన్ చెల్లించడం లేదు. మిగితా బెనిఫిట్స్ పాత పెన్షన్ విధానంలో లాగే ఖాతాలో జమ ఉన్న EL/HPL ఎన్ క్యాష్ మెంట్, GIS కింద జమచేసిన అమౌంట్ కాని ఆకాల మరణం పొందిన సందర్భంలో GIS కింద జమచేసిన అమౌంట్ తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ అమౌంట్ ను APGLI అమౌంట్ ను మొ|| వాటిని చెల్లిస్తారు.

♦️సీపీఎస్ గురించి వివరణ

👉 ఉద్యోగ విరమణానతరం ప్రతినెల ఉద్యోగికి/ తనపైన ఆధారపడిన వారికి చెల్లించే జీవన భృతికి అప్పటివరకు ఉన్న విధానం లో కాకుండా అప్పటి NDA ప్రభుత్వం వారు 2001-02 బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు ఉద్యోగ విరమణానంతరం ఇచ్చే పెన్షన్లో మార్పు చేయడానికి బి.కె భట్టాచార్య నేతృత్వంలో హైపవర్ కమిటిని ఏర్పాటు చేసి, వారి ప్రతిపాధనలను తేది 23.08.2003 రోజున ఆమోదించి తేది 01.01.2004 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు ఉద్యోగి వాటా ఏమి చెల్లించకుండా పొందే పెన్షన్ కి బదులు ఉద్యోగి వాటాగా బేసిక్ పే మరియు డి.ఎ ల మొత్తం పై 10% నిధిని జమ చేస్తే అంతే మొత్తంలో ప్రభుత్వ వాటా చెల్లించేలా నూతన విదానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పెన్షన్ నిధిని National Pension System (NPS) Trust వారు National Securities Depository Limited (NSDL) ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టి తదుపరి పదవీ విరమణ సమయంలో సర్వీస్ మొత్తం లో ఉద్యోగి మరియు ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో Anuity ప్లాన్ లలో పెట్టి నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు. దీనికోసం Pension Fund Regulatory and Development Authority (PFRDA) ను ఏర్పాటు చేసారు. ఈ నూతన పెన్షన్ విధానాన్ని మిగితా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి అమలు చేయవచ్చు అని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే తమిళనాడు మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు నూతన పెన్షన్ అమలు చేస్తుండగా, కేవలం పచ్చిమ బెంగాల్ మరియు త్రిపుర రెండు రాష్ట్రాలు మాత్రమే పాత పెన్షన్ ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ. చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ సంస్కరణ (Pension Reform) లో భాగంగా అప్పటివరకు పెన్షనర్ లకు చెల్లించే కరువు భృతిని (Dearness Relief) 2001 నుండి నిలుపుదల చేసినాడు. కీ.శే. రాజశేకర్ రెడ్డి గారు 2004 సాధారణ ఎన్నికలలో హామీ ఇచ్చి ఆరు విడుతల కరువు భృతిని విడుదల చేసి పెన్షన్ తో డి.ఆర్ చెల్లించే విదానం కొనసాగించారు. ఒకవేళ 6 నెలలకు ఒకసారి పెంచే కరువు భృతిని చెల్లించడము నిలిపివేసి, ప్రతి 5సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ రివైస్ చేయడం ఆపేస్తే పాత పెన్షన్ పరిస్థితి కొత్త పెన్షన్ కంటే అద్వాన్నంగా ఉండేది.

👉 మిగతా అన్ని రాష్ట్రాలు వేరు వేరు తేదిలలో నుండి ఈవిధానాన్ని అమలుచేస్తూ National Pension System (NPS) Trust లో చేరి తమ రాష్ట్ర ఉద్యోగుల పెన్షన్ నిధిని NSDL ద్వారా షేర్ మార్కెట్‌లలో పెడుతున్నారు. కాని తమిళనాడు రాష్ట్రం CPS ముందునుండి అమలు చేస్తున్నా వారి నూతన పెన్షన్ నిధిని NPS Trust లో చేరని కారణంగా వారి వద్దే ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర ఉద్యోగ సంఘాల నిరసనల మేరకు పాత పెన్షన్ కొనసాగించడానికి ఉన్న సాధ్యాలను పరిశీలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటి ని ఏర్పాటు చేసారు. త్వరలో వారికి పాత పెన్షన్ పునరుద్దరిస్తారని ఆశిస్తూ... అది ఇతర రాష్ట్రాల వారికి మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ నూతన పెన్షన్ విధానాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ 653, 654, 655 తేది 22.09.2004 ప్రకారం తేది 01.09.2004 నుండి ఉద్యోగంలో చేరిన వారికి కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం (CPS) ని అమలు చేస్తూ, GPF సదుపాయాన్ని తీసివేసారు, బేసిక్ పే మరియు డి.ఎ ల మొత్తం పై 10% ఉద్యోగివాటాగా అంతే మొత్తంలో ప్రభుత్వ వాటాను కలిపి సి.పి.యస్ ఖాతాకు పెన్షన్ నిధిగా జమచేస్తుంది.

👉 ఖాతా నిర్వహణకు దాదాపు 2009 వరకు ట్రెజరీ ఐడి పై కట్ చేశారు తదుపరి CPS ఖాతా నిర్వహణ కు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA), నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) రూపొందించిన పెర్మనెంట్ రిటైర్మెంట్ ఎకౌంటు (PRAN) ను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఖాతా నెంబర్ గా జారి చేస్తారు. CPS నిధిని SBI పెన్షన్ ఫండ్ స్కీం నందు 34%, LIC పెన్షన్ ఫండ్ స్కీం నందు 34% మరియు UTI పెన్షన్ ఫండ్ స్కీం నందు 32% గా పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు 2010 సంవత్సరం వరకు జీతంలో కట్ అయిన అమౌంట్ కు మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పటివరకు వారి వారి ఖాతాలలో జమ కాలేదు.
దీనికోసం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థికశాఖకి విన్నవించడం జరిగింది. జి.ఓ‌ 226 తేది 29.09.2011 ప్రకారం 01.04.2009 నుండి 31.03.2011 వరకు మరియు జి.ఓ 142 తేది 17.06.2013 ప్రకారం 01.04.2011 నుండి సి.పి.యస్ లబ్ధిదారుడి వాటా మరియు ప్రభుత్వ వాటా రెండింటి మొత్తాన్ని ఖాతాలో జమ చేసేంత వరకు జరిగిన ఆలస్యానికి సంవత్సరానికి 8% చొప్పున వడ్డీ ఖాతా దారుడి ఖాతాలో జమచేయాలి.

14, మే 2021, శుక్రవారం

భయం - రచన గంజి దుర్గాప్రసాద్

భయం

ఆధిపత్యపు చీకట్లకు
వాతలు పెడుతు
గీతలు గీస్తు
మెరుపుల మరకలతో
ఉరకలు వేసే మిణుగురుల
ఉత్సాహం చూస్తే భయం.
నత్తనడకలకు కొత్తపరుగులు
నేర్పిస్తాయని...!

గబ్బిలాల్ల తలకిందులుగా వేలాడే 
అస్తవ్యస్త వ్యవస్థల అపసవ్యాలు
ఒడిసిపట్టే  చేతుల చేవ చూస్తే భయం. 
చేష్టలుడిగిన చేతుల తో
చేయి కలుపుతాయని...!

మన్నుతిన్న పాముల్లా మత్తుగా
నిర్లక్ష్యం కుబుసాల్లో 
కులాసాగ నిద్రించే కర్తవ్యాలను 
అదిలించే కర్రల అజమాయిషీలు చూస్తే భయం.
పేరుకున్న స్తబ్ధతలో
కూరుకుపోయిన బుర్రలకు
ఊతమైపోతాయని...!

నిమ్మకు నీరెత్తినట్లు
గడపదాటని
ఉదాసీన విధానాల సోమరితనాలకు
చురకలేసే కొరకంచు రాతల వేడిమంటే భయం.
అక్షరాలకు తర్ఫీదునిచ్చి
అగ్గిపిడుగుల్ని చేస్తాయని...!

తెప్పచినుకుల్లా కురిపించిన
తప్పుడు వాగ్ధానాలు
తవ్వితీసే కలం గునపాలు చూస్తే భయం.
అధికారం పునాదులు కదిలిపోతాయని...!

మౌనం దిబ్బలు బద్ధలు కొడుతు
తిరగబడే ధిక్కారస్వరాల
పొలికేకలంటే భయం.
మూగనోము పట్టిన గొంతులు
వంతలు పలుకుతాయని...!

ఏటివరద కు ఎదురీదుతు ఎగిరే
పరక పిల్లల చురుకుదనం చూస్తే భయం.
చతికిలపడ్డ నిస్తేజాలు
ఉత్తేజంతో నిలబడతాయని...!


               గంజి దుర్గాప్రసాద్
                        వలిగొండ
                   9885068731

12, మే 2021, బుధవారం

ఆరోగ్యం ఎంత బాగుండెను

ఆరోగ్యం ఎంత బాగుండెను

సైకిల్ టైరును
కర్రతో కొడుతూ
గరగిర తిప్పుకుంటూ
చింత చెట్టు క్రింద
రాలిన చింత కాయ
తింటూ.....
ఎగిరెగిరి అందుకున్న
గుబ్బ కాయ
తింటూ......
ముల్లు గుచ్చుకున్న
మొదల్లో ఉన్న
ఈత పండు
తింటూ.......
అల్లుకపోయిన
చేయీదూరని కంప
పరిక పండు
తింటూ.......
తగిలితే
వదలని కంప
రేగి పండు
నిగనిగ లాడె
బలుసు పండు
తింటూ.......
పండి పండని
బొప్పడి కాయ
లేలేత ముంజను
తింటూ......
కొమ్మన దొరికే
బంక బంక లాడె
ఇరికి పండు
తింటూ....
గురిచూసి కొట్టిన
మామిడి కాయ
ఆకుచాటున్న
జామకాయ
తింటూ.......
సైకిల్ టైరును
కర్రతో కొడుతూ
గరగిర తిప్పుకుంటూ
ఆడిన ఆటలతో
తిన్న తిండితో
ఆరోగ్యం ఎంత బాగుండెను

                    షేక్ రంజాన్

11, మే 2021, మంగళవారం

అదొక విషాదం-సంక్షోభం-పోరాటం

అదొక విషాదం-సంక్షోభం-పోరాటం

ఉన్న వ్యవస్థ........
అనేక అసమానతలు....
దుర్మార్గాల వేదిక....
ప్రాకృతిక వైపరీత్యామూ......
మానవ దుర్మార్గమూ........
అవసాన దశ......
కరుణించని నిర్భంధం...,
మనస్సులో మానవీయతా.....
శిఖరాయమానంగా.......
వెలుగుతున్న దృశ్యాలూ....
స్వార్థంతో అల్లాడిపోతూ......
మృత్యు వ్యాపారం.......
శ్వాసల ఎగపోతలు .....
ఆసుపత్రి గుమ్మాలు.....
ఎక్కిదిగే రోగులు.........
ఆదుకొమ్మని ఆర్తనాదాలు.....
అనాధలయ్యే పిల్లలు.......
ఒకే ప్రాణావాయువు........
పంచుకునే ఇద్దరు రోగులు...
సీల్ చేసిన మృత దేహాలు.....
ఒకే చితిలో మండిపోయ్యే.....
అనేకానేక దేహాలు......

అదొక-విషాదం-సంక్షోభం-పోరాటం

                     షేక్ రంజాన్

అహం (వరల్డ్ ఈగో అవేర్ నెస్ డే సందర్భంగా)

అహం (వరల్డ్ ఈగో అవేర్ నెస్ డే సందర్భంగా)

             చేసిన తప్పులను
 ఒప్పు కోవాలనుకున్న ప్రతీసారి
            వద్దు వద్దంటూ
      సైంధవుడిలా అడ్డగిస్తావు.
   అంతరాలు భేషజాలు లేకుండా
 అందరితో మమేకం కావాలని చూస్తే
              కులం మతం
                పేద ధనిక
           స్థాయి భేదాలంటూ
  ప్రహరిగోడలా ప్రత్యక్షమవుతావు.
         వివాదాల పరంపరకు
         వీడ్కోలు చరమగీతం
            పాడాలనుకుంటే
                వీల్లేదంటూ 
  ముళ్ళకంచెలా హద్దులు గీస్తావు.
        అంతరాత్మ అద్దంలో
       నన్ను నేను చూడబోతే
      అడంబరపు ముసుగులా
              అడ్డమొస్తావు.
        ఎంత ఎత్తులకెదిగినా
    నీడలా వెంటపడి వేధిస్తావు.
    రంగమేదైనా వ్యక్తులెవరైనా
   తరతరాలు నీ నిరంకుశత్వ
               పరంపరకు
         తలొంచక తప్పలేదు.
                  చివరకు
  నా ఉనికినే ప్రశ్నార్థకం చేయాలని
               ప్రయత్నిస్తావు.

                         గంజి.దుర్గాప్రసాద్
                              వలిగొండ.
                          9885068731

సందేహం - సమాధానం

సందేహం - సమాధానం

ప్రశ్న:

ఒక ఉపాధ్యాయుడు గృహిణి ఐన తన భార్యకు కిడ్నీని దానం చేయడానికి అంగీకరించాడు. ఈ సర్జరీ కోసం ఆ ఉపాధ్యాయునికి డాక్టర్లు 6 - 8 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడు వేతనంతో కూడిన సెలవులు పొందాలంటే ఏం చెయ్యాలి?

👉 సమాధానం:

వైద్య కారణాలతో (మెడికల్ గ్రౌండ్స్) కమ్యూటేషన్ సెలవుగానీ, ఎరండు లీవును గాని తీసుకుని పూర్తి జీతము పొందవచ్చు. అందుకు డాక్టర్ సర్టిఫికేట్ జతపరచాలి. G.O. Ms.No. 386, DT: 6-9-1976;; G.O. 268, DT: 28-10-1991 and G.O. 29, DT: 9-3-2011.

ప్రశ్న:

దాదాపు6 సంవత్సరాల కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై, అక్కడ కూడా 2 సం,, రాలు పనిచేసి తిరిగి పాత పోస్ట్‌ లో చేరిన ఉపాధ్యాయుని 2 సం,,రాల సర్వీసును ఏవిధంగా లెక్కిస్తారు ? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా ?

👉సమాధానం:

FR -26(i) ప్రకారం ప్రస్తుత పోస్ట్ పై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు, ప్రస్తుత పోస్ట్ కంటే తక్కువ కాని పోస్ట్ లో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కించవచ్చును. G.O.Ms.No. 117, F&P, DT: 20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2 సం,,. ఇతర పోస్ట్ సర్వీసు AAS నకు  కూడా లెక్కించబడుతుంది.

ప్రశ్న:

6 సంవత్సరాల 3 నెలల కాలం స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి Proper Channel ద్వారా విడుదల అయ్యి TSWRDC డిగ్రీ లెక్చరర్‌గా ఎంపికైన ఉపాధ్యాయురాలు 18 నెలలు పనిచేసి తిరిగి పాత ఉద్యోగంలో చేరితే సర్వీసు ఏవిధంగా లెక్కిస్తారు ? ఇంక్రిమెంట్ ఏవిధంగా లెక్కిస్తారు ? డిగ్రీ లెక్చరర్‌గా పనిచేసిన సర్వీసు పాత S.A సర్వీసుకు సాలరీ ప్రొటెక్షన్ వర్తిస్తుందా ? లేదా పాత సర్వీసులోని ఇంక్రిమెంట్ ని కలుపుతూ సాలరీ కొనసాగిస్తారా ?

👉సమాధానం:

వెనక్కి రావచ్చు. ఆ సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కిస్తారు. Regular Post కు మూడేళ్ల లీన్ ఉంటుంది. కనుక వెనక్కి వస్తే పాత పోస్ట్ యొక్క అన్ని Benefits వర్తిస్తాయి.

భార్య/ భర్తలు ఇద్దరు ఉద్యోగులైతే అటువంటి సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ ను ఎలా చెల్లిస్తారు?

భార్య/ భర్తలు ఇద్దరు ఉద్యోగులైతే అటువంటి సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ ను ఎలా చెల్లిస్తారు?

జ॥ 1) భార్య/ భర్తలు ఎవరో ఒకరు సర్వీసులో కాని / రిటైర్‌ అయిన తరువాత చనిపోతే అతని/ఆమె, భాగస్వామి పెన్షను బ్రతికి వున్నంత వరకు చెల్లించాలి.

2) బ్రతికి వున్న వారు రిటైర్‌ అయితే రెండు పెన్నన్లు,1 సర్వీసు పెన్నను 2 ఫ్యామిలీ పెన్నను చెల్లిస్తారు.

3) భార్య/భర్త (తల్లి/తండ్రి) ఇద్దరూ చనిపోతే వారి పిల్లలకు రెండు ఫ్యామిలీ పెన్సనులు చెల్లిస్తారు కాని రెండు ఫ్యామిలీ పెన్నన్లు కలిపి నెలకు ప్రస్తుతము గరిష్టంగా రూ.27830/- గా సవరించారు.

రూలు 50, 10 (ఎ) (i) (ii) (బి)

GO. (P) No. 245 F (Pen.I) Department Dated 4-9-2012.

10, మే 2021, సోమవారం

వందనాలు - అభివందనాలు

వందనాలు అభివందనాలు


కష్టాలు కన్నీళ్లు
దాచుకొని.....
లాలిస్తూ... కరుణిస్తూ...
ప్రేమిస్తూ... ప్రోత్సహించే....
తల్లులకు....
వందనాలు అభివందనాలు

అభ్యాగులు నిరుపేదలు
అనాధలు వృద్దులు
వితంతవులు రోగులను
ఆదుకునే...
తల్లులకు....
వందనాలు అభివందనాలు

సంస్కృతి కట్టుబాట్లు
బాధ్యతలు నేర్పి...
చేదోడు వాదోడుగా
ధైర్యము మనోబలాన్ని
పెంపొందించే....
తల్లులకు.....
వందనాలు అభివందనాలు

కుటుంబ సంక్షోభాన్ని
అత్యంత చాకచక్యంగా 
మనో నిబ్బరంతో పరిష్కరించే
నేర్పు ఓర్పు ఉన్న...
తల్లులకు....
వందనాలు అభివందనాలు

మానవత్వం సమానత్వం
సౌబ్రాతత్వం.......
సాధనే లక్ష్యంగా..
ముందుకు పోతున్న..
తల్లులకు......
వందనాలు అభివందనాలు

అదృష్టాన్ని చూసి
మురిసి పోక....
కష్టాలు వచ్చాయని
కుంగి పోక.....
బాధ్యతల బరువు..
భుజస్కంధాల పై....
వేసుకునే....
తల్లులకు...
వందనాలు అభివందనాలు

గృహిణిగా......
ఇంటిని చక్కదిద్దుతూ....
యుగాలు.....
గడిచే కొద్ది...
శక్తివంతమవుతున్న......
తల్లులకు.....
వందనాలు అభివందనాలు

వైద్యరాలుగా.. పోలీసుగా...
నర్సుగా.. ఉపాధ్యాయురాలుగా.......
రక రకాల బాధ్యతలు........
చేప్పట్టి........
సమాజాన్ని సరిదిద్దేపనిలో....
భాగస్వాములైన........
తల్లులకు......
వందనాలు అభివందనాలు

సమాజ ఉన్నతికి
సహకరిస్తూ.......
బిడ్డలను.......
రేపటి బాధ్యతాయుతమైన...
పౌరులుగా......
తీర్చిదిద్దుతున్న....
తల్లులకు.....
వందనాలు అభివందనాలు

అందరికి మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ....

                షేక్ రంజాన్

9, మే 2021, ఆదివారం

అమ్మ పద్యం (మదర్స్ డే కవిత)

అమ్మ పద్యం (మదర్స్ డే కవిత)

అలవోకగా
అమ్మనోట
తేనేచుక్కల్లా జాలువారిన
ఇతిహాస పద్యాలు
బతుకమ్మ పాటలు
నీతికథలు
ఆకలిని మరిపించి
హాయిగా నిద్రపుచ్చిన
అద్భుతమంత్రాలు.
అమ్మ నేర్పిన పద్యాలు
చెప్పిన కథలు
బ్రతుకుబాటలను చూపే
బడిపంతులును చేసాయి.

పరువు ప్రతిష్ఠల 
వారసత్వాలు
గత వైభవ గౌరవాల బరువులతో
బీదరికపు బాధల
భిన్నధృవాల మధ్య నలుగుతు
గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చిన 
అమ్మను చూస్తే
స్థితప్రజ్ఞతల భూమధ్యరేఖ లా
కన్పిస్తుంది.

తాను వేసిన పునాదులపై
తలెత్తుకు నిలబడిన 
భవంతుల ఎదుగుదలను
తన క్షేత్రంలో
విత్తనాలుగా మొలకెత్తిన
ప్రయోజకత్వ
ఫలవృక్షాలను చూసిన
అమ్మ కళ్ళలో 
కదలాడుతున్న
ఆనందాతిశయాల పారవశ్యం.

పరిపూర్ణ జీవితానుభవాలతో
పండిపోయిన
అమ్మను చూసినప్పుడల్లా
అన్పిస్తుంది.
మళ్ళీ!
అమ్మగా పుట్టకు
నా ఇంటి ఆడబిడ్డగా పుట్టు
ఏ కొంతైనా
నీ రుణం తీర్చుకోవాలనీ..,

  
                             గంజి.దుర్గాప్రసాద్
                                      వలిగొండ
                                 9885068731

అమ్మ - అవని

అమ్మ - అవని
ఆ.వె : 

కాంచు నెపుడు మనల కారుణ్య మూర్తియై
ప్రేమ నెంతొ  పంచు పృథ్వి యందు
అమ్మ యన్న మనకు ఆరాధ్య దేవతై
అపర కీర్తి బొందె నమృత వల్లి
                            ( 01 )

మాంధ్య మందు చూపు మంత్రియై మనమున
చిరము ఖ్యాతి గాంచు చెల్లి గాను
వివిధ పాత్ర లందు వేల్పుడు ఘణతను
రణము నందు నెగ్గు రాణి వోలె
                                (02)

మంచి మనసు గల్గి మమతల మూటయై
ఓర్మి తోటి నేర్పు ఒజ్జ గాను
అమ్మ కన్న లేదు యవనిన దైవము
మాతృ  మూర్తి నెపుడు మరువ వలదు
                             ( 03  )

అమ్మ యన్న పదము కమ్మని పలుకుయై
పరుల హితము గోరె బట్టు కొమ్మ
తెలుగు నందు లేదు తీయని కావ్యము
వర్ణమాల యందు ప్రథమ పదము
                          ( 04  )

✍️ శ్రీహరి.ఏలే,
పా.స.ఉ.(సాంఘిక శాస్త్రం)
జి.ప.ఉ.పా ,పుల్లెంల
చండూరు మం.
నల్లగొండ
96406 91884
( నేడు మాతృమూర్తులందరికి " అంతర్జాతీయ మాతృ దినోత్సవం  " శుభాకాంక్షలు )

పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్‌ ఏ రోజు వరకు చెల్లిస్తారు?

పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్‌ ఏ రోజు వరకు చెల్లిస్తారు?

సమాధానం
 
✍️1) కుమారులకు 25 సంవత్సరాల వయసు వరకు లేక అతను సంపాదన మొదలు పెట్టే రోజు వరకు ఏది ముందు సంభవిస్తే అంతవరకు

GO.Ms.No. 287, F&P dt. 12-8-1999,

 ✍️2) కుమార్తెలకు పెళ్ళి అయ్యేంత వరకు/వారు సంపాదన మొదలు పెట్టెంత వరకు ఏది ముందు సంభవిస్తే అంతవరకు.


రూలు 50.
Executive instruction (iv) (ii) (a) (b)
GO.Ms.No. 278, Fin& Plg. (Fw-Pen-I) Dept., dt. 19-10-1987.

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంటు వయసు ఎంత?

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంటు వయసు ఎంత?

✍️జ॥ (1) వర్క్‌మెన్‌ మరియు నాల్గవ తరగతి ఉద్యోగులు - 60 సంవత్సరాలు.
             (2) ఇతరులు - 61 సం॥లు(తెలంగాణ), 60 సం॥లు(ఆంధ్రప్రదేశ్‌).
 
ఏ రోజున తప్పక రిటైర్‌ కావాలి?

✍️జ॥ పుట్టిన తేది ఆ నెలలో ఒకటవ తేదీ కాకుండా ఉన్నవారికి 61/60 అయిన నెలలోచివరి రోజున రిటైర్‌ కావాలి.

ఉదా: - పుట్టిన తేది 2-1-1954 అయితే 61 సంవత్సరాల రిటైర్‌మెంట్‌ వయసు అయితే రిటైర్‌మెంట్‌ 31-1-2015 అవుతుంది. పుట్టిన తేది ఒకటవ తేదీ అయితే పుట్టిన నెలకంటే ముందు నెల చివరి రోజున రిటైర్‌ కావాలి.

ఉదా:- పుట్టిన తేది 1-1-1954 అయితే 61 సంవత్సరాల రిటైర్‌ మెంటు వయసు అయితే రిటైర్‌మెంటు 31-12-2014 అవుతుంది.

రూలు -42

Executive Instruction (i)

GO.Ms.No. 289, Fin.&Plg. Dept., dated. 4-11-1974.

కారుణ్య నియామకాలకు అర్హులెవరు?

చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇటీవలి కాలంలో కోవిడ్ బారిన పడి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కు అర్హత ఉంటుంది.. దాని కోసం కారుణ్య నియామకాల పూర్తి నిబంధనలను ఇక్కడ పొందుపర్చుతున్నాను.

కారుణ్య నియామకాలు

ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆసరా కోల్పోతారు. ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడినా అదే పరిస్థితి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోడానికే కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టారు. అయితే ఈ నియామకాలపై చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఎప్పుడిస్తారు, ఎలా ఇస్తారు, ఎవరికిస్తారు, ఎక్కడిస్తారు, ఎప్పటిలోపు ఇవ్వాలి, ఏ పోస్టులిస్తారు ఇలా అనేక అనుమానాలున్నాయి.

మీకోసమే ఈ సమాచారం

కారుణ్య నియామకాలు :

రెండు రకాలు.

ఒకటి: మరణించిన ఉద్యోగి కుటుంబీకులకు ఇచ్చేది.

రెండు: వైద్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి ఆధారితులకు ఇచ్చేది.

👉కారుణ్య నియామకాల లక్ష్యం ఏమిటి ?

మరణించిన లేక అనారోగ్య సమస్య వల్ల ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడిన ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం.

జీవోలు:

మరణించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడినవారికి జీవో 687, జీఏడీ, 03.10.1977 ద్వారా కారుణ్య నియామకం ఇస్తారు. కాలక్రమంలో ఈ జీవోకు సంబంధించి పలు సవరణలు, వివరణలు ఇచ్చారు. వీటన్నింటినీ చేర్చి 60681/సర్వీస్‌-ఏ/2003-1, జీఏడీ, 12.08.2003 ద్వారా సమగ్ర ఉత్తర్వులు ఇచ్చారు. వైద్య కారణాల వల్ల రిటైర్‌ అయిన ఉద్యోగుల వారసుల కారుణ్య నియామక అవకాశాన్ని జీవో ఎంఎస్‌ నెం.661, జీఏడీ, తేదీ 23.10.2008 ద్వారా పునరుద్ధరించారు. సర్వీసులో ఉండి మరణించిన ఎయిడెడ్‌ టీచర్ల వారసులకు కారుణ్య నియామకాలను జీవో ఎంఎస్‌ నెంబర్‌ 113, విద్యాశాఖ, తేదీ : 6.10.2009 ద్వారా అనుమతించారు.

కారుణ్య నియామకాలకు అర్హులెవరు?

మరణించిన ఉద్యోగి వారసులు, వైద్య కారణాల వల్ల రిటైర్‌మెంట్‌ తీసుకున్న ఉద్యోగి వారసులు, ఏడేళ్లపాటు కనిపించకుండాపోయిన ఉద్యోగి వారసులు ఈ నియామకాలకు అర్హులు. వైద్య కారణాల వల్ల కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండగా రిటైర్‌మెంటు తీసుకుంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారు. కనిపించకుండాపోయిన ఉద్యోగి విషయంలో పోలీసు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.

👉 ఎవరికిస్తారు?

ఎలాంటి కారణ్య నియామకమైనా ఎవరికిస్తారన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. దానికి విధివిధానాలు ఉన్నాయి.

1.ఉద్యోగి భార్య/భర్త,

 2.కుమారుడు/కుమార్తె,

3.ఉద్యోగి మరణించిన నాటికి కనీసం ఐదేళ్ల మునుపు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు/కుమార్తె,

4.ఉద్యోగి భార్య/భర్త నియామకానికి ఇష్టపడని సందర్భంలో ఆ కుటుంబంపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె.

5. మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె, మైనర్‌ కుమార్తె ఉంటే వారి తల్లి సూచించినవారికి ఉద్యోగం ఇస్తారు.

6.ఉద్యోగి అవివాహితుడై మరణించినపుడు అతని తమ్ముడు, చెల్లెలు కారుణ్య నియామకానికి అర్హులు.

ఏ పోస్టులో నియమిస్తారు?

జూనియర్‌ అసిస్టెంటు పోస్టులోగానీ, ఆ పోస్టు స్కేలుకు మించని పోస్టులోగానీ, అంతకన్నా తక్కువస్థాయి పోస్టులోగానీ నియమిస్తారు.

👉నియామక విధానం ఎలా?

ఉద్యోగి మరణించిన ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులుయ నియామకం కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. మైనర్‌ పిల్లల విషయంలో ఉద్యోగి మరణించిన రెండు సంవత్సరాలలోపు 18 సంవత్సరాలు వయసు నిండినపుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణించబడుతుంది. వైద్య కారణాల వల్ల రిటైర్మెంట్‌ కోరుకునేవారి దరఖాస్తు జిల్లా/రాష్ట్ర వైద్యుల కమిటీకి పంపి వారి నివేదిక ఆధారంగా జిల్లా/రాష్ట్ర కమిటీ సిఫార్సు మేరకు నియామకాధికారి అనుమతి ఇస్తారు.

అర్హతలు:

ఆయా పోస్టులకు సంబంధించిన నిర్ణీత అర్హతలు కలిగివుండాలి. అయితే జూనియర్‌ అసిస్టెంట్‌గా సబార్డినేట్‌ ఆఫీసులో నియామక అర్హతైన ఇంటర్మీడియెట్‌ పాసయ్యేందుకు 3 సంవత్సరాల గడువు, శాఖాధిపతి కార్యాలయం లేక సచివాలయం అయితే నియామక అర్హతైన డిగ్రీ పాసయ్యేందుకు 5 సంవత్సరాల గడువు ఇస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కులాల వారికి ఐదేళ్ల మినహాయింపు ఉంది. ఉద్యోగి భార్య/భర్తకు నియామకం ఇవ్వాల్సి వస్తే వారికి వయోపరిమితి 45 ఏళ్లు. చివరి శ్రేణి పోస్టుకు వయసు, అర్హతలు తగిన విధంగా లేనపుడు ముందు నియామకం ఇచ్చి ఆ తరువాత మినహాయింపును సంబంధిత శాఖ నుంచి పొందవచ్చును.

నియామక పరిధి:

మరణించిన ప్రభుత్వ ఉద్యోగి పనిచేసిన యూనిట్‌లో నియామకం ఇస్తారు. ఆ యూనిట్‌లో ఖాళీలు లేనపుడు ఆ కేసులను నోడల్‌ అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు పంపిస్తే ఆయన ఇతర డిపార్టుమెంట్లకు కేటాయిస్తారు. ఏ డిపార్టుమెంట్‌లోనూ ఖాళీలు లేని సందర్భంలో కలెక్టరు ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో 5 వరకు సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించొచ్చు. అంతకు మించి పోస్టులు అవసరమైనపుడు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపాలి.

ఈ కారుణ్య నియామకాలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాలో సిక్స్‌ పాయింట్‌ ఫార్మలాకు లోబడి ఇవ్వబడతాయి. రిజర్వేషన్‌ నిబంధన (రూల్‌ 22)ను పాటించాల్సి వుంటుంది. మరణించిన ఉద్యోగి భార్య కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకుంటే ఆమె సొంత జిల్లాలోగానీ, భర్త ఉద్యోగం చేసిన చోటగానీ, ఏ ఇతర జిల్లాలోగానీ నియామకం కోరవచ్చు.      

■ ఇటీవలి ఉత్తర్వులు:

◆ భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, అందులో ఒకరు రిటైర్‌ అయి పెన్షన్‌ తీసుకుంటుండగా, మరొకరు మరణిస్తే వారిపై ఆధారితులకు కారుణ్య నియామకం వర్తించదు. ఆ ఇంట్లో పెన్షన్‌ పొందుతున్న వ్యక్తి ఉన్నందున దాన్ని ఆదాయం ఉన్న కుటుంబంగానే పరిగణించి కారుణ్య నియామకం ఇవ్వరు. దీనికి సంబంధించి సర్క్యులర్‌ మెమో నెం.3548/సర్వస్‌-జి/ఏ2/2010-8, జీఏడీ, తేదీ : 24.03.2012 జారీ చేసింది.

◆ భర్త /భార్య చనిపోతే భార్యకు/భర్తకు 45 వయసు దాటితే కారుణ్య నియామకానికి అనర్హులు... అయినా ప్రభుత్వం నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చిన సందర్భం...
(GO MS No. 45 Dated .28.02.2020)

👉 ఎక్స్‌గ్రేషియా :

కారుణ్య నియామకం ఇవ్వడానికి సాధ్యపడని సందర్భంలో నాల్గో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు రూ.40వేలు, నాన్‌ గెజిటెట్‌ వారికి రూ.60 వేలు, గెజిటెడ్‌ ఉద్యోగుల కుటుంబాలకు రూ.80 వేలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలి.