LATEST UPDATES

28, జూన్ 2018, గురువారం

ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్న పీఆర్సీ

*📢ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్న పీఆర్సీ

*వివిధ క్యాటగిరీలు, వేతన స్కేళ్లపై అధ్యయనం

*ఉద్యోగులకు, శాఖాధిపతులకు ప్రశ్నావళి

*అగస్టు 15లోగా ప్రభుత్వానికి నివేదిక

రాష్ట్రప్రభుత్వం సీఆర్ బిశ్వాల్ సారథ్యంలో ఏర్పాటుచేసిన పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) ఉద్యోగులకు సంబంధించిన పూర్తివివరాలను సేకరిస్తున్నది. వివిధ క్యాటగిరీల ఉద్యోగులకు అమలవుతున్న వేతనవిధానం, డీఏ, అలవెన్సులు తదితరఅంశాలను పరిశీలిస్తున్నది. ఆగస్టు15లోగా నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని కమిటీ సమాయత్తమవుతున్నది. ఒకే క్యాడర్ ఉద్యోగులకు ఒక్కోశాఖలో ఒక్కో వేతన విధానం అమలవుతున్న విషయాన్ని కమిషన్ పరిశీలించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పీఆర్సీ కమిషన్ వివిధ శాఖలకు, ఉద్యోగులకు, శాఖాధిపతులకు ప్రశ్నావళిని పంపించింది. 1993, 1999, 2005, 2010, 2014 సంవత్సరాల్లో పీఆర్సీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేస్తున్నది. 2014లో కనిష్ఠ వేతనం రూ.13000లు, గరిష్ఠవేతనం రూ.1,10,850 లుగా నిర్ణయించారు. ప్రస్తుతం అమలుచేస్తున్న మాస్టర్‌స్కేల్ విధానంపై అన్నిశాఖల ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

ఒక సిన్సియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కథ...

మంచి కాలేజీలో Btech అయిపోయిన వెంటనే నాకు డీసెంట్ ఉద్యోగం వచ్చింది..

ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసుకోమని వత్తిడి చేస్తుంటే పెళ్ళి చూపులకి వెళ్ళాను

అమ్మాయి నచ్చింది.. ఆ అమ్మాయికి నేను నచ్చలేదని మొహం మీదే చెప్పేసింది..

నేను ఉక్రోషంతో....

సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత చూడు..ఇంత మంచి సంభందం ఎందుకు వదులుకున్నానా..? అని భాధ పడతావు...అని వచ్చేసాను..

After 5 years..

ట్రాపిక్ సిగ్నల్ దగ్గర నన్ను రిజక్ట్ చేసిన అమ్మాయి ఆడీ కారులో(Audi car) తన Boy friend తో ఉంది..

నేను నా యాక్టివా కిక్ కొడుతున్నాను..స్టార్ట్ అవట్లేదు..బహుశా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందనుకుంటా..!అదే సమయంలో ఆ అమ్మాయి నన్ను చూసింది..కానీ నన్ను గుర్తు పట్టలేదు..

ఆ క్షణం...ఇన్ని రోజుల నా డ్రెవింగ్ కెరీర్లో మొదటి సారిగా హెల్మెట్ వల్ల ఉపయోగం తెలిసింది..😜😜

# హెల్మెట్ ధరించండి.. మిమ్మల్ని మీరు అన్నిరకాలుగా కాపాడుకోండీ..

Note : ఈ స్టోరీ నాదికాదు..😅 ఒక సిన్సియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కథ...

#ప్రజా ప్రయోజనార్ధం జారీ చేయటమైనది..

అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక చెరువు నిండా మొసళ్ళు

అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక చెరువు నిండా మొసళ్ళు

ఆ చెరువు లో దూకి  మొసళ్ళకు దొరక్కుండా  తప్పించుకొని పైకి వస్తే కోటి రూపాయలు బహుమతి అని ప్రకటించారు.    

పోటీ చూడ్డానికి వచ్చిన   జనాలు  ఒక్కరూ కూడ దైర్యం చేసి  ముందుకు రాలేదు.
ఇంతలో...
వెనక ముందు చూడకుండా కాంతారావు దూకాడు.
దూకాడమే కాకుండ ఈతకొడుతూ పైకి వచ్చాడు.

అక్కడ  ఉన్నవారందరూ అభినందనలతో ముంచెత్తారు, కోటి రూపాయల  బహుమతి కూడ ఇచ్చారు.

బహుమతి స్వీకరించిన కాంతారావు కోపంతో చుట్టూ చూస్తూ ఇప్పుడు చెప్పండి నన్ను చెరువులోకి తోసింది ఎవరు ???

అక్కడున్న వారందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

అయితే...
తన పక్కనే  నించున్న తన భార్య కాంతం మాత్రం ముసిముసిగా నవ్వుతూ కనబడింది.

  నీతీ :
ప్రతి  మగవాడి విజయం  వెనక ఒక  స్త్రీ ఉంటుంది.

27, జూన్ 2018, బుధవారం

తిరుమల తిరుపతి గురించి చాలామందికి తెలియని, తెలుసుకోవాల్సిన సమాచారం

తిరుమల తిరుపతి గురించి చాలామందికి తెలియని, తెలుసుకోవాల్సిన సమాచారం :
*తి.తి.దే.దేవస్థానము చరిత్ర*

🔔  కలియుగ ప్రత్యక్ష దేవుడు ఐన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం అవేలాది భక్తులు వస్తుంటారు.

పర్వ దినాలలో వారి సంఖ్య లక్షలకు చేరుతుంది. ఈ స్వామి వారి
👉 *వార్షికాదాయం ఎంత తెలుసా...?*
ఏకంగా ఏడు వందల యాబై కోట్ల రూపాయల కు పైమాటే....

👉 ఈ స్వామి వారికి మూడు వేల కిలోల బంగారు డిపాజిట్లున్నాయి.

👉 ఇంకా వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లున్నాయి.

👉 ఈ ఆలయానికి ఏటా సరాసరిన మూడు వందల కోట్ల రూపాయలు,

👉 మూడు వందల కిలోల బంగారు ఆబరణాలు,

👉 ఐదు వందల కిలోల వెండి ఆబరణాలు కానుకలుగా
వస్తుంటాయి.

👉 ఈ స్వామి వారికి జరిగే ఉదయాస్తమాన
సేవ టికెటు ధర *పది లక్షల రూపాయలు.*

అయినా ఆ టికెట్లు రాబోయె ముప్పై ఏళ్ళ వరకు బుక్ అయి
పోయాయి.

🔔 మొత్తంమీద ఈ ఆలయం సంపద విలువ ముప్పైమూడు వేల కోట్ల రూపాయలు.

👉 ఈ ఆలయం వలన లక్షకు పైగా ప్రజలు ఉపాది పొందుతున్నారు.

👉 *తిరుమల శ్రీనివాసుని ఆదాయం విషయానికొస్తే:....*

💐 *సుమారుగా*💐
🔴 ఏటా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా  వంద కోట్లు ఆ దాయం వస్తున్నది.

🔴 బ్యాంకుల్లో
వుండే ఫిక్సుడు డిపాజిట్ల పై వడ్డీ 140 కోట్లు వుంటుంది.

🛑మన స్వామి వారి చెంత నున్న
బంగారం సుమారు ఐదు టన్నులు.

🛑 విదేశాలలో వున్న స్థిరాస్తుల విలువ సుమారు 33 వేల కోట్లు.

🛑 ఈ ఆలయ పాలన అంతా 1952 వరకు మహంతులు,
మిరాసీ దారుల చేతుల్లో వుండేది.

🛑 ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి చేతుల్లోకి వచ్చింది.

తి.తి.దే ఏర్పడ్డాక కూడ మిరాసి విధానమె కొనసాగింది. అనగా
పూజారులు వంశ పారంపర్య హక్కు కలిగి వుండే వారు.
అర్చకులకు వేతనాలకు బదులు శ్రీవారి ప్రసాదాల్లో వటా ఇచ్చేవారు. తయారు చేసిన ప్రతి *51 లడ్డులకు 11 లడ్డులను* మిరాసి కింద అర్చకులకిచ్చేవారు.
వాటిని అర్చకులు అమ్ముకునెవారు.

🛑 1987 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామా రావు / మిరాసి విధానాన్ని రద్దు చేశారు.

🛑 కాని అర్చకులు కోర్టు కెల్లారు. 1996 నాటి కోర్టు తీర్పు తర్వాత తి.తి.దే మిరాసి పద్దతిని పూర్తిగా రద్దు చేసింది.

🛑 అర్చకులకు వేతనం ఇచ్చే పద్దతిని ప్రారంబించారు.

కాని ఇప్పుడు మిరాసి విధానాన్ని
పునరుద్దరించాలని అర్చకులు పోరాడుతున్నారు.

🛑 *కారణం ఏమంటే......?*

👉తి.తి.దే ప్రస్తుతం రోజుకు సుమారు 4 లక్షల లడ్డులను తయారు చేస్తున్నది.

👉మిరాసి విధానం ప్రకారం ప్రతి *51 లడ్డులకు 11 లడ్డులను* అర్చకులకివ్వాలి. అనగా రోజుకు 86,274 లడ్డులను అర్చకులకివ్వాలి.

👉 ప్రస్తుతం ఒక లడ్డు *ధర 25* రూపాయలు. ఆ లెక్కన మిరాసి ధారులకు రోజుకు 21,56,000
రూపాయలను చెల్లించాలి. ఇంత ఆదాయాన్ని వదులు కోడానికి వారికి రుచించ లేదు.

👉 శ్రీవారు 2011 వ సంవత్సరంలో ఆదాయం: రూ.1700 కోట్ల రూపాయలు రాగా వివిద జాతీయ
బ్యాంకుల్లో వున్న డిపాజిట్లు కు వడ్డీ
ద్వార ......, వివిద రకాల పూజా కార్య క్రమాల ద్వార రోజు వారి టికెట్ల విక్రయం ద్వారా మరో 200
కోట్ల రూపాయల ఆదాయం లబించింది.

👉ఇవి కాక భక్తులు సమర్పించిన వజ్రాలు, బంగారం,వెండి, వంటి ఆభరణాలు సమర్పించారు. ఈ ఏడాది అనగా *2012 లో 2.2 కోట్ల మంది భక్తులు స్వామి
వాని దర్శించు కున్నారు.*

       🙏💐🙏💐🙏

🔔 తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు *వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి*
తిరుమలలో శ్రీవారికి
రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి.

🔔 *అవి:*
👉 *ప్రత్యూష,*
👉 *ప్రభాత,*
👉 *మధ్యాహ్న,*
👉 *అపరాహ్ణ,*
👉 *సాయంకాల,*
👉 *రాత్రి పూజలు.* తెల్లవారుజామున జరిగే *సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.*

💐 *సుప్రభాతం:*
నిత్యం స్వామివారికి జరిపించే
ప్రప్రథమ సేవ ఇదే.

👉 నిత్యం తెల్లవారుజామున
మూడు గంటలకు సుప్రభాత సేవ
మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు,
శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల)
దేవాలయం వద్దకు వస్తారు.
*నగారా మండపంలో గంట మోగుతుంది*.

మహాద్వారం గుండా సన్నిధి
గొల్ల ముందు వెళుతుండగా
అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు.
కుంచెకోలను,
తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న
క్షేత్రపాలక శిలకు తాకించి
ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి
అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే
అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి
వంశీకుడు తంబురా పట్టుకుని
మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు.
బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల
దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే
అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ
వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత
శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి,
మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో
తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ,
గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని
మేల్కొలుపుతుంటాడు. అర్చక
స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి
గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి
పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని
మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి
ముందు తెరను వేస్తారు. ప్రధాన
అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం
సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన
పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి
స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి
భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ
సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని
విశ్వరూప దర్శనం అంటారు.
శుద్ధి: సుప్రభాత సేవ
అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి
మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ
శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత
రాత్రి జరిగిన అలంకరణలు,
పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి
ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.
అర్చన: శ్రీవారికి
ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది.
దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది)
నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న
వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి
సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష
సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి
ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు,
గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు.
చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి
విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు.
ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ
స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ
సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి
భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి
ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత
మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి,
అలంకారాసనం సమర్పిస్తారు.
అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి
నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని
దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు.
తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి)
స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.
తోమాలసేవ: తమిళంలో 'తోడుత్తమాలై' అంటే
దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ
మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'...
తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన
అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని
పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో
ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ
జరిపిస్తారు.
శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన
తరువాత తోమాలసేవ చేస్తారు.
కొలువు: తోమాలసేవ తర్వాత
పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో
కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్
జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత
మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని,
ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి
విన్నవిస్తారు. ముందురోజు హుండీ
ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ,
నాణాలు సహా (డినామినేషన్ ప్రకారం) మొత్తం విలువ
తెలియజేస్తారు. అనంతరం నువ్వులు,
బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా
సమర్పిస్తారు.
సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30
వరకు సహస్రనామార్చన జరుగుతుంది.
బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి
వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ
అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న
పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి
దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో
మిరాశీదారు వరాహ పురాణం లోని
లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత
నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.
మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు,
అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత
స్వామివారికది నైవేద్యసమయం.
నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని
శుభ్రం చేసి, బంగారు వాకిలి
తలుపులు మూసేస్తారు. తిరుమామణి
మంటపంలోని గంటలు మోగిస్తారు.
అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి
పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి
(అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు,
దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి
(పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో
మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి.
వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది
నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి
పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి
మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.
రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన
అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది.
పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు,
పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా
సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం,
కర్పూరహారతి ఇస్తారు.
రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ
వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది.
అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర
శతనామార్చన, శ్రీదేవి, భూదేవి
మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ
అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట
మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.
ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే
పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు.
ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో
కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి
పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా
పెడతారు. రాత్రిపూట స్వామివారిని
పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని
కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు.
ఏడుకొండల వాడిని
నిదురపుచ్చేందుకు అన్నమయ్య
కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి
అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల
పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో
మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో
ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.
గుడిమూసే ప్రక్రియ: రాత్రి
రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ
మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ
తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి
గడియలు బిగిస్తారు.
అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై
సీళ్లు వేస్తారు.
ప్రత్యేక సేవలు
రోజువారీ అర్చనలు,
ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ,
గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి
ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి
సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద
పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగిసేవ,
తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. స్వామికి
రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం,
సహస్ర దీపాలంకరణ, ఆర్జిత
బ్రహ్మోత్సవాలు ఇవన్నీ
ఉత్సవమూర్తులకు జరిగేవి.
సడలింపు: గురువారం ప్రాతఃకాల
పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి
ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని
తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల
కన్నులు భక్తులకు కనిపిస్తాయి.
అనంతరం శ్రీవారికి 24మూరల
పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ
కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు,
శంఖచక్రాలు, కర్ణాభరణాలు,
స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి
తలుపులు తెరుస్తారు. దీన్నే
సడలింపు అంటారు.
పూలంగిసేవ: ఆపాదమస్తకం స్వామివారిని
పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ.
తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి
దివ్యమనోహర
విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.
తిరుప్పావడ: భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటా
---Dept of PRO TTD.

30 రోజుల తర్వాత పీఎఫ్‌ను తీసుకోవచ్చు!

30 రోజుల తర్వాత పీఎఫ్‌ను తీసుకోవచ్చు!

(ప్రజ్ఞ టుడే)న్యూదిల్లీ: ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత సదరు ఉద్యోగి తన ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్‌వో)నుంచి 75శాతం వరకూ సొమ్మును తీసుకోవచ్చని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. మంగళవారం జరిగిన కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ ట్రస్టీల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, మిగిలిన 25శాతాన్ని కూడా ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ కింద రెండు నెలల తర్వాత తీసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది.

‘ఉద్యోగం కోల్పోయిన వారు నిరుద్యోగులుగా గుర్తించి, వారి ఖాతాల్లో అప్పటివరకూ జమ అయిన పీఎఫ్‌లో 75శాతం వరకూ వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాం.’ అని కార్మికశాఖ మంత్రి సంతోష గంగ్వార్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన రెండు నెలల తర్వాత సదరు ఉద్యోగి తన పీఎఫ్‌ ఖాతా నుంచి కేవలం 60శాతం మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. దీన్ని ఒక నెలకు తగ్గించారు. అంతేకాదు, పీఎఫ్‌ సొమ్మును వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మళ్లీ ఉద్యోగంలో చేరతామనుకునేవారు తమ ఖాతాను రద్దు చేయకుండా కొనసాగించే అవకాశం ఉంది.

అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్లు గంగ్వార్‌ తెలిపారు. ఎస్‌బీఐ, యూటీఐలలో ఈటీఎఫ్‌లను మరో ఏడాది పాటు అంటే జులై 1, 2019 వరకూ పొడిగించినట్లు వెల్లడించారు. ఫండ్‌ మేనేజర్ల కాలపరిమితిని కూడా డిసెంబరు 31, 2018 వరకూ పొడిగించారు. ఫండ్‌ మేనేజర్లను మూడేళ్ల కాలపరిమితికి ఏప్రిల్‌ 1, 2015లో నియమించగా, జూన్‌ 30, 2018తో వారి గడువు ముగిసింది.

వెబ్ కౌన్సిలింగ్ మంచిదంటూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మెసేజెస్ పంపుతున్న వారు దీనికి సమాధానము చెప్పండి....

వెబ్ కౌన్సిలింగ్ మంచిదంటూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మెసేజెస్ పంపుతున్న వారు దీనికి సమాధానము చెప్పండి....

మిత్రమా.... గాయం ఒక చోట ఉంటే మందు ఒక చోట పెట్టినట్లుగా ఉన్నది ఇప్పటి పరిస్థితి... మీరు చెప్పిన కొన్ని విషయాలతో నేను కూడా ఏకీభవిస్తాను... కాని దానికి పరిష్కారం ఇది మాత్రం కాదు అని  నా అభిప్రాయం... వెబ్ కౌన్సిల్ వలన దొంగ సర్టిఫికెట్లు తగ్గాయా? SSC సబ్జెక్ట్ పాయింట్లలో తప్పులు జరగలేదా? అర్హత లేకున్నా ఇప్పటికి D కేటగిరి పేరుతో అధిక పాయింట్లు పొందిన వారు లేరా? వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఏది ఆగిపోయింది... సరి అయిన విధి విధానాలు రూపొందించకుండా తప్పులు చేసిన వారి పైన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడంతో అవకాశవాదులు తప్పులు చేస్తూనే ఉన్నారు... మీరన్నట్లుగా సాంకేతికతను అందరూ స్వాగతించాల్సిందే... కాని దాని వలన పని సులభతరం కావాలి  కష్టతరం కాకూడదు... సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినప్పుడు పని వేగవంతంగా పూర్తి అయ్యేలా ఉండాలి కానీ మరింత ఆలస్యం చేసేదిగా ఉండకూడదు... మీరు చెప్పినట్లు రాత్రి పగలు కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద పడిగాపులు కాయాలనే ఆలోచన ఎవరికి లేదు, దాని వలన అందరం ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళమే కానీ ఇప్పుడు అంత కన్నా అధ్వాన్నంగా పరిస్థితి తయారయ్యేలా ఉన్నది. ఈ రోజు నేను మన కరీంనగర్ లో అందరి కన్నా మిన్నగా బిల్స్ చేస్తారని పేరు ఉన్న ఒక ఉపాధ్యాయ సోదరుని దగ్గర SA గణితం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్ళాను... 100 కన్నా తక్కువ ఆప్షన్స్ అయితేనే ఇస్తాను. 100 ఇవ్వడానికి గంట సమయం పడుతుంది.. అంత కన్నా ఎక్కువ అయితే నా వల్ల కాదు ఇంకా ఎక్కడికైనా వెళ్ళండి అన్నారు... నేను తీసుకు వెళ్లిన వ్యక్తిది 550 పైన ర్యాంకు.. పైగా లాంగ్ స్టాండింగ్.. ఉండేది కరీంనగర్ లో... కాబట్టి  కనీసం 400 వరకైనా ఆప్షన్స్ ఇచ్చి మిగతావి బల్క్ గా అప్లోడ్ చేద్దాం అనుకున్నాము... తాను తొలుత చేయను అన్నప్పటికి నా మాట కాదనలేక పని మొదలుపెట్టి 215 ఆప్షన్స్ ఇవ్వగానే పవర్ పోయింది...అయిన వరకు సేవ్ చేద్దాము అంటే కంపల్సరీ కాబట్టి అన్ని ఆప్షన్స్ ఇస్తే తప్ప సేవ్ తీసుకోవడం లేదు... తొందర తొందరగా ఇంకో 25 ఆప్షన్స్ ఇచ్చామో లేదో కంప్యూటర్ ఆఫ్ అయిపోయింది... దాదాపు 2.30 గంటల సమయం కష్టపడితే పని పూర్తి కాలేదు... ఇక తన వల్ల కాదు బయట చేసుకోండి సార్ అని చెప్పడంతో ఇంటికి వచ్చాము... ఈ సాఫ్ట్ వేర్ మిడి మిడి పరిజ్ఞానముతో రూపొందించినట్లు ఉన్నది తప్ప ఉపయోగకరంగా లేదు... ఎంసెట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ కిందికి మీదికి జరుపుకునే సదుపాయం ఉంటది కానీ ఇందులో కనీసం ఆ సదుపాయం కూడా లేదు..  ఒకసారి ఏదైనా మధ్యలో తప్పుగా ఇచినట్లైతే దానిని తొలగించడం తప్ప దాని స్థానంలో సరైంది ఇవ్వడానికి అవకాశం లేదు.. ఇంకా చాలా లోపాలు ఉన్నాయి... నిన్న జరిగిన ప్రధానోపాధ్యాయుల కౌన్సిలింగ్ లో spouce కేటగిరీ లో ఒకరికి కేవలం 7 మండలాలు ఆప్షన్స్ గా వచ్చాయి ఒకవేళ అవి దొరక్కపోతే పరిస్థితి ఏంటి... అలాగే మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే spouce వాళ్ళు అదే మండలం లేదా దగ్గరి మండలంలో పోస్టింగ్ పొందే వాళ్ళు... ఇప్పుడు అలా కాకుండా అందరూ కరీంనగర్ వచ్చి చేరితే మిగతా ఉపాద్యాయుల పరిస్థితి ఏంటి... ఇప్పటికే spouce కేటగిరీ తీసివేయాలి అని వస్తున్న డిమాండ్ కి మరింత బలం చేకూర్చినట్లు కాదా... అన్ని విధాలా అనుకులమైన సాఫ్ట్ వేర్ ను రూపొందించి ముందుగా ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి ఫలితాల ఆధారంగా ఆచరణలో ప్రవేశ పెట్టాల్సింది... కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఒక సాఫ్ట్ వేర్ రూపొందించి అది మన ముఖాన పారేసి అడిగిన కొద్దీ రోజుకో మార్పు చేసుకుంటూ పోతుంటే ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుంది... ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న కాలంలో ఒక్క సాఫ్ట్ వేర్ ను సమర్థవంతంగా రూపొందించకుండా ఉపాధ్యాయులను తప్పు పడితే ఎలా... చివరిగా ఒక ప్రశ్న... నా ర్యాంకు 1006... నేను ఉండేది కరీంనగర్ లో... కనీసం ఎన్ని మండలాల్లో ఎన్ని స్థానాలు చూపిస్తే నాకు కచ్చితంగా ప్లేస్ వస్తుందో చెప్పగలరా... సాఫ్ట్ వేర్ రూపిందించిన వారే 1007 ఇస్తే గ్యారంటీ అంటున్నారు... అలాంటప్పుడు నేను 1007 ఇవ్వాలి అంటే కనీసం 10 గంటలు నెట్ సెంటర్లో ఉండి ఆప్షన్స్ ఇవ్వాలి... మరి నా ఒక్కడికే అంత సమయం పడితే అందరివి ఎప్పుడు పూర్తి అవుతాయి... ఇది మిమ్మల్ని ప్రశ్నించడం కోసమో లేక మరో దాని కోసమో కాదు...నాకు ఎదురైన పరిస్థితి తీవ్రతను మీకు తెలియ పరచాలని ఉద్దేశంతోనే.... మరొక్క సారి మీరు వెబ్ కౌన్సిలింగ్ విషయమై పునరాలోచన చేయాలని ఎల్లుండి ప్రారంభం కాబోయే SGT ల పరిస్థితిని అంచనా వేయాలని మా సూచన...

---సామాన్య ఉపాద్యాయుడు......
(సాంకేతిక పరిజ్ఞానం లేని ఉపాద్యాయులందరు ఇబ్బంది పడుతున్నారు--ఇది నిజం)