LATEST UPDATES

13, జూన్ 2021, ఆదివారం

పెన్షనర్ల కు అదనపు పెన్షన్

This is a simple translate button.

పెన్షనర్ల కు అదనపు పెన్షన్

GO 57 ప్రకారం -

రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ కు 70 సంవత్సరముల వయస్సు  దాటితే అదనపు పెన్షన్ పొందే అవకాశం కలదు. ఈ అదనపు పెన్షన్ వారి వయస్సును బట్టి క్రింది విధముగా పెరుగుతుంది.  ఈ పెరుగుదల వారి నూతన బేసిక్ పెన్షన్ మీద ఉంటుంది.



70 - 75 సం. - 15 %
75 - 80 సం. - 20 %
80 - 85 సం. - 30 %
85 - 90 సం. - 40 %
90 - 95 సం. - 50 %
95 - 100 సం. - 60 %
100 సం. పైన - 100 % పెరుగుదల ఉంటుంది.

పుట్టిన తేదీ నెల మధ్యలో ఉన్నను, ఆర్ధిక లాభం ఆ నెల మొదటి తేదీ నుండి వర్తిస్తుంది.

ఉదాహరణకు --
ఒక పెన్షనర్ / ఫ్యామిలీ పెన్షనర్ కు 16.08.2021 కు 70 సంవత్సరములు నిండితే , అతను /ఆమె కు  01.08.2021 నుండి అతను / ఆమె బేసిక్ పెన్షన్ లో 15 % పెంచి, దాని మీద కరువు భత్యం కలిపి చెల్లిస్తారు.

పెన్షన్ రు.10,000 అయితే 15% చొప్పున రు.1,500 పెంచి మొత్తం రు. 11,500 చెల్లిస్తారు. ఈ 11,500 మీద కరువు భత్యం కూడా ఇస్తారు.  ఇది 01.08.2018 నుండి అమలు లోనికి వచ్చినా, ఆర్ధిక లాభం మాత్రం 01.04.2020 నుండి ఇస్తారు.

పెంచిన క్వాంటం పెన్షన్ ను పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో స్పష్టం గా వ్రాస్తారు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి