LATEST UPDATES

24, ఫిబ్రవరి 2016, బుధవారం

ఎవరి న్యాయం వాళ్ళది - కథ

This is a simple translate button.

     ఒక చెట్టు తొర్రలో ఒక పక్షి గూడు పెట్టుకుంది. ఒకరోజు అది గూటికి ఆలస్యంగా తిరిగి వచ్చింది. అప్పటికే ఒక కుందేలు ఆ చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోయింది.

     ఏయ్! ఎవరు నువ్వు? నా గూటికి ఎందుకొచ్చావు. వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపో అని పక్షి అంది. దేవుడిచ్చిన భూమిని, చెట్లను, చెట్ల తొర్రలను ‘నా స్వంతం’ అని ఎవరూ అనలేదు. ఈ స్థలం నీది కాదు, నాది. కావాలంటే ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి న్యాయం చెప్పమని అడుగు అని కుందేలు పక్షితో అంది.

     పాపం పక్షి రాత్రంతా చెట్టు కొమ్మలమీద గడిపింది తెల్లవారగానే పక్షి, కుందేలు పెద్ద మనిషిని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఒక చెరువు గట్టున బావురు పిల్లి కన్పించింది. రెండూ కూడబలుక్కొని బావురు పిల్లిని పెద్దమనిషిగా అంగీకరించి తమ కథలు మొదలు పెట్టాయి. కాని బావురుపిల్లి చెవిటి దానిగా నటిస్తూ ‘‘నేను ముసలి దాన్ని నాకు చెవులు సరిగా పని చేయడం లేదు. ఇంకాస్త దగ్గరికి వచ్చి చెప్పండి’’ అంది. పక్షి, కుందేలు బావురుపిల్లికి బాగా దగ్గరగా వచ్చి మళ్లీ కథ మొదలు పెట్టబోయింది. అంతే! బావురు పిల్లి చప్పున ఒక చెేత్తో పక్షిని, ఇంకో చేత్తో కుందేలును అదిమిపట్టి చంపి తినేసింది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి