LATEST UPDATES

17, జులై 2018, మంగళవారం

కాళిదాసు గర్వభంగం

This is a simple translate button.

కాళిదాసు గర్వభంగం

మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.

మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.

బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.

ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది.

ఆమెను చూసి...
‘బాలికా! నాకు దాహంగా ఉంది.
నీళ్లు ఇవ్వమ’ని* అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక...

‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని* బదులిచ్చింది.

కాళిదాసు:
‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి?
పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.

అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...

‘మీరు అసత్య మాడుతున్నారు.

ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు.

వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’* అంటుంది.

అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...

‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది.

ముందు నీళ్లు ఇవ్వమని'* బతిమాలుకుంటాడు.

అయినా ఆ బాలిక కనికరించదు.

‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’

అని అడుగు తుంది. బాలిక.

‘నేను బాటసారి’ని* అన్నాడు కాళిదాసు.

‘మళ్లీ అసత్య మాడుతున్నారు.

బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.

మీరేమో అలిసి పోయారు కదా.

ఈ లోకం లో అలా అలసి పోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు.

వారే సూర్యచంద్రులు!’

అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.

దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి..

‘మాతా నీళ్లు ఇవ్వండి.

దాహం తో చనిపోయేలా ఉన్నాను..’
అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు.

లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి...

‘మీరెవరో సెలవివ్వండి...నీళ్లిస్తాను’  అంది.

కాళిదాసు దీనంగా...

‘నేను అతిథిని..!’* అని బదులిచ్చాడు.

‘మీరు అసత్యం చెబుతున్నారు.

ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు.

ఒకటి ధనం, రెండోది యవ్వనం.

ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’* అంటుంది.

కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు.

కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు.

ఈ ప్రపంచంలో ఇద్దరే సహన శీలురు ఉన్నారు.

ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’* అని అడిగింది.

ఓపిక నశించిన కాళిదాసు..

‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు.

ఆ అవ్వ నవ్వుతూ...

ఇదీ అసత్యమే.

ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు.

ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు.
ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’* అని అంటుంది.

ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.

ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు.

ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.

‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా!

కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’
అని జలమును అనుగ్రహిస్తుంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి